తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న యాంకర్ సుమ, రాజీవ్ కనకాల దంపతులు

ప్రముఖ యాంకర్ సుమ, నటుడు రాజీవ్ కనకాల దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శనివారం (జూన్ 7) తెల్లవారు జామున వేంకటేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.  టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. 

వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు రాజీవ్ కనకాల దంపతులు. అనంతరం ఆలయంలోకి వెళ్లి స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. 

శనివారం వీకెండ్ కావటంతో తిరుమలకు భక్తులు పోటెత్తారు. అదే సమయంలో పలువురు ప్రముఖులు, సెలెబ్రిటీలో స్వామివారిని దర్శించుకున్నారు. అందులో రాజీవ్ కనకాల, సుమ దంపతులు శ్రీవారి దర్శనం కోసం రావటంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసి స్వామివారి దర్శనం కల్పించారు టీటీడీ అధికారులు.