మేం చెప్పినోళ్లకే జాబ్స్ ఇవ్వాలి… YSRCP నేత జులుం

మేం చెప్పినోళ్లకే జాబ్స్ ఇవ్వాలి… YSRCP నేత జులుం

అనంతపురం: కియా కార్ల కంపెనీ మేనేజర్ ను బెదిరించిన వైసీపీ నాయకునికి కౌన్సిలింగ్ ఇచ్చారు ఏపీ పోలీసులు. ఆంధ్ర ప్రదేశ్ అనంతపురం సికెపల్లి గ్రామానికి చెందిన వైసీపీ లీడర్ రామచంద్రారెడ్డి కియా ప్లాంట్ జనరల్ మేనేజర్ సదాశివానికి ఫోన్ చేసి బెధిరించారు. తాము చెప్పిన వాళ్లకే ఉద్యోగాలు ఇవ్వాలని.. తమ వాహనాలనే రెంట్ కు తీసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. దీంతో కియా కంపెనీ అధికారులు అనంతపురం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును దర్మపురి DSP రమాకాంత్ కి అప్పగించారు SP.

కియా కంపెనీ అధికారులకు వార్నింగ్ ఇచ్చిన రామచంద్రారెడ్డిని ధర్మపురి DSP రమాకాంత్  పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో ఎవరికైనా బెదిరింపులు ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఉద్యోగాలు కల్పిస్తున్న కంపెనీలపై బెదిరింపులు జరిపితే సహించేదిలేదని తెలిపారు DSP రమాకాంత్.