బోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు

బోటుప్రమాదం: కొట్టుకు వస్తున్న మృతదేహాలు

ఆంధ్ర ప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా పాపికొండలలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారికోసం మూడోరోజు గాలింపుచర్యలు జరుగుతున్నాయి.  ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు అగ్నిమాపక దళం, గజ ఈతగాళ్లు మృతదేహాల కోసం గాలిస్తున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట 17వ గేటు వద్దకు ఓ మృతదేహం కొట్టుకువచ్చిందని.…. కచ్చులూరు వద్ద మరో మృతదేహాన్ని గుర్తించామన్నారు. ఈ మృతదేహలను దేవీపట్నం పోలీసు స్టేషన్‌కు తరలించినట్లుగా చెప్పారు పోలీసులు. బోటు మునిగిన ప్రాంతంలో సుడిగుండాలు ఏర్పడుతుండడంతో గాలింపు చర్యలకు తీవ్ర ప్రతికూలం ఏర్పడుతోందని చెప్పారు పోలీసులు. సుడిగుండాలు, వరద ఉధృతితో సహాయక బోట్లు నిలవని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు.