చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు

చెడ్డీ గ్యాంగ్ ఫొటోలను విడుదల చేసిన ఏపీ పోలీసులు

విజయవాడ :  నగరంలో దొంగతనాలకు పాల్పడుతూ ప్రజలను భయపెడుతున్న చెడ్డీ గ్యాంగ్‌ కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ టి.కె.రాణా తెలిపారు. నగరంలోని గుణదల, మధురానగర్‌ రైల్వేస్టేషన్‌ ప్రాంతాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విజయవాడ నగరంలో చెడ్డీ గ్యాంగ్‌ తాళం వేసిన ఇళ్లు, విల్లాస్, అపార్టుమెంట్లలో తరచూ దొంగతనాలకు పాల్పడుతూ కలకలం సృష్టిస్తున్నారని, దీనివలన ప్రజలు ఆందోళనకు గురవుతున్నారన్నారు. ఏపీలో చోరీలు చేస్తున్న చెడ్డీ గ్యాంగ్ ఆచూకీ కోసం 8 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నట్లు చెప్పారు. గుజరాత్ లోని దాహోద్ జిల్లా నుంచి చెడ్డీ గ్యాంగ్ వచ్చినట్లు కృష్ణా, గుంటూరు పోలీసుల జాయింట్ ఆపరేషన్ లో గుర్తించారు. నున్న గ్రామంలో స్థానికులు.... చెడ్డీ గ్యాంగ్ లోని ఓ వ్యక్తిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు.