కార్తీక స్నానాలకు వెళ్లి.. కృష్ణా నదిలో యువకుల గల్లంతు

కార్తీక స్నానాలకు వెళ్లి.. కృష్ణా నదిలో యువకుల గల్లంతు

ఏపీలో విషాద ఘటన చోటు చేసుకుంది. కృష్ణా నదిలో ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు దగ్గర ఈ ఘటన జరిగింది. కార్తీక స్నానాల కోసం కొందరు యువకులు ఈ రోజు తెల్లవారుజామున కృష్ణానదికి వెళ్లారు. నదిలో ప్రవాహ వేగం ఎక్కువగా ఉండటంతో ముగ్గురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిని గొరిపర్తి నరేంద్రబాబు, గొరిపర్తి శివ నాగరాజు, గొరిపర్తి పవన్‌గా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి.

మొత్తం పది మంది యువకులు నదికి వెళ్లారని, వారిలో ముగ్గురు నదిలో కొట్టుకుపోయారని పోలీసులు తెలిపారు. ఘటన గురించి తెలియగానే గజ ఈతగాళ్లుతో అక్కడికి చేరుకున్నామని చెప్పారు. గల్లంతైన వారిలో ఇద్దరి మృతదేహాలను ఇప్పటికే వెలికితీశామని, మరో వ్యక్తి పరిస్థితి ఇంకా తెలియాల్సి ఉందని అన్నారు. నదిలో గాలింపు కొనసాగుతోందని చెప్పారు.