కాంగ్రెస్​ చెల్లని రూపాయి : క్రాంతికిరణ్

కాంగ్రెస్​ చెల్లని రూపాయి : క్రాంతికిరణ్

జోగిపేట, వెలుగు :  సీఎం కేసీఆర్​ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు గడపగడపకు చేరాయని ఆందోల్​ఎమ్మెల్యే క్రాంతికిరణ్​ అన్నారు. సోమవారం మండలంలోని డాకూర్​, కోడెకల్​ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్​చెల్లని రూపాయని, పనులు చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని ప్రజలకు సూచించారు.

తెలంగాణ ప్రభుత్వం నీళ్లు , నిధులు, నియామకాలపై ఎక్కడా తగ్గకుండా పనిచేసిందన్నారు. డబుల్​ బెడ్​ రూంలు  రాని వారికి త్వరలో అందజేస్తామన్నారు. ఆయన వెంట జడ్పీ చైర్​ పర్సన్​మంజూశ్రీ, డీసీసీబీ డైరెక్టర్​ జైపాల్​రెడ్డి, మార్క్​ఫెడ్​ డైరెక్టర్​ జగన్మోహన్​రెడ్డి పాల్గొన్నారు.