యానిమల్ చిత్రంలో సెకండ్ హీరోయిన్గా నటించిన త్రిప్తి డిమ్రి... బ్లాక్ బస్టర్ సక్సెస్తో పాటు యూత్లో అద్భుతమైన ఫాలోయింగ్ను అందుకుంది. త్వరలోనే తెలుగులోనూ ఎంట్రీ ఇవ్వబోతోందని, రవితేజ, విజయ్ లాంటి హీరోలకు జంటగా నటించనుందని వార్తలొస్తున్నాయి. అయితే వీటన్నింటి కంటే ముందు బాలీవుడ్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ అవుతోందామె. తాజాగా ఓ క్రేజీ ఫ్రాంచైజీలో ఛాన్స్ అందుకుంది త్రిప్తి. కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ‘భూల్ భూలయ్య 3’ సినిమాలో ఆమె నటించబోతోంది.
ఇందులో విద్యాబాలన్ మంజూలికగా కీలకపాత్ర పోషిస్తోంది. మాధురీ దీక్షిత్ కూడా ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తోంది. ఇటీవల త్రిప్తి డిమ్రిని తీసుకుంటున్నట్టుగా మేకర్స్ ప్రకటించారు. అనీస్ బాజ్మీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం దీపావళికి విడుదల కానుంది. ఇప్పటికే ఈ ఫ్రాంచైజీలో వచ్చిన రెండు చిత్రాలు మెప్పించడంతో దీనిపై అంచనాలు నెలకొన్నాయి. ఇక ప్రస్తుతం విక్కీ కౌశల్కి జంటగా 'మేరే మెహబూబ్ మేరే సనమ్’, రాజ్కుమార్ రావుతో కలిసి ‘విక్కీ విద్యా కా వో వాలా వీడియో’లో ఆమె నటిస్తోంది. మొత్తానికి క్రేజీ లైనప్తో త్రిప్తి డిమ్రి బాలీవుడ్లో దూసుకెళుతోంది.