విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

విపత్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ అంకిత్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: విపత్తులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలను రూపొందించాలని భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్​ అంకిత్​ ఆదేశించారు. కలెక్టరేట్​ నుంచి పలు శాఖల అధికారులతో గురువారం ఆయన వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. జిల్లాలో వరదలు, అటవీ ప్రాంతాల్లో సంభవించే ప్రమాదాలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు పక్కాగా ప్రణాళికలను రూపొందించాలన్నారు. గోదావరి పరివాహక ప్రాంతంలో వరదలు సంభవించినప్పుడు అధికారులంతా సమన్వయంతో పని చేయాలన్నారు. ఇందుకు సంబంధించి మాక్​ ఎక్సర్​సైజ్​ చేయాలన్నారు. ఎన్​డీఎంఏ లీడ్​ కన్సల్టెంట్​ మేజర్​ జనరల్​ సుధీర్​ బహాల్​ మాట్లాడుతూ ఈ నెల 18న రాష్ట్రవ్యాప్తంగా విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్​ ఎక్సర్​సైజ్​లు నిర్వహించనున్నట్లు తెలిపారు. 

వాతావరణ మార్పుల ప్రభావంతో తక్కువ టైంలో భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు వస్తాయన్నారు. అగ్నిప్రమాదాలతో అటవీ ప్రాంతాలు నష్టపోతున్నామని తెలిపారు. ప్రతి శాఖలో డిజాస్టర్​ మేనేజ్​మెంట్​ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రమాదాల నివారణకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. అడిషనల్​ కలెక్టర్లు​డి.వేణుగోపాల్, విద్యా చందన, డీఎఫ్​వో కృష్ణ గౌడ్, ఆర్డీవో మధు, సీపీవో సంజీవ్​రావు, మిషన్​ భగీరథ అధికారి తిరుమలేశ్, ఆర్అండ్​బీ ఈఈ నాగేశ్వరరావు, పౌర సరఫరాల శాఖ అధికారి త్రినాథ్​ బాబు పాల్గొన్నారు.