- మైనారిటీ డిక్లరేషన్లో ప్రకటించిన కాంగ్రెస్
- మైనారిటీ బడ్జెట్ రూ.4,000 కోట్లకు పెంపు
- చదువుకునేటోళ్లకు రూ.10 వేల నుంచి 5 లక్షల దాకా ఆర్థిక సాయం
- ఉర్దూ మీడియం టీచర్ల నియామకానికి ప్రత్యేక డీఎస్సీ
- ఇండ్లు లేనివాళ్లకు ఇంటి స్థలం.. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం
హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు కులగణనతో పాటు మైనారిటీల జనాభాను లెక్కించి ఉద్యోగాలు, విద్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో న్యాయమైన రిజర్వేషన్లను కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. మైనారిటీ బడ్జెట్ను రూ.4000 కోట్లకు పెంచుతామని.. ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ మాదిరిగానే మైనారిటీ సబ్ ప్లాన్ను అమలు చేస్తామని ప్రకటించింది. నిరుద్యోగ మైనారిటీ యువత, మహిళలకు సబ్సిడీ రుణాలను అందించేందుకు ఏడాదికి రూ.వెయ్యి కోట్లు ఇస్తామని తెలిపింది.
గురువారం హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్లో షబ్బీర్ అలీ నేతృత్వంలో నిర్వహించిన మైనారిటీల సమావేశంలో పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, సీడబ్ల్యూసీ మెంబర్ సల్మాన్ ఖుర్షీద్ ‘మైనారిటీ డిక్లరేషన్’ను విడుదల చేశారు. పీహెచ్డీ, ఎంఫిల్ పూర్తి చేసిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ఇతర మైనారిటీల యువతకు ‘‘అబ్దుల్కలాం తౌఫా ఏ తలీమ్’’ స్కీమ్ కింద రూ.5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని డిక్లరేషన్లో పేర్కొన్నారు. పీజీ పూర్తిచేసిన వారికి రూ.లక్ష, డిగ్రీ చదివిన వారికి రూ.25 వేలు, ఇంటర్ పూర్తి చేసిన వారికి రూ.15 వేలు, టెన్త్ క్లాస్ పూర్తి చేసినవారికి రూ.10 వేల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు.
మైనారిటీ డిక్లరేషన్లోని మరిన్ని అంశాలు..
- తెలంగాణ సిక్కు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు. మైనారిటీ కార్పొరేషన్
- సంస్థల్లో ఖాళీల భర్తీ.
- ఉర్దూ మీడియం టీచర్ల
- నియామకానికి ప్రత్యేక డీఎస్సీ.
- హక్కులు, సంస్కృతి సంప్రదాయాల రక్షణ.
- ఇమామ్లు, మౌజిమ్లు, ఖాదీమ్లు, పాస్టర్లు, గ్రంథిలతోపాటు అన్ని మైనారిటీల మత పెద్దలకు రూ.10 వేల నుంచి రూ.12 వేల గౌరవ వేతనం.
- వక్ఫ్ బోర్డు భూమి, ఆస్తుల డిజిటలైజేషన్.
- ఆక్రమణలకు గురైన ఆస్తులను తిరిగి తీసుకుని
- రిజిస్టర్ చేయడం.
- ముస్లిం, క్రిస్టియన్ శ్మశాన వాటికల
- కోసం భూమి.
- ఇండ్లులేని మైనారిటీ కుటుంబాలందరికీ
- ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఇంటి స్థలం. ఇల్లు కట్టుకునేందుకు రూ.5 లక్షల సాయం.
- కొత్తగా పెండ్లయిన ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు సహా ఇతర మైనారిటీల జంటలకు రూ.1.60 లక్షల ఆర్థిక సాయం.
- సెట్విన్, నైపుణ్యాభివృద్ధి శిక్షణ పునరుద్ధరణ.
- ఓల్డ్ సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు ‘కులీ కుతుబ్ షా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ’ ఏర్పాటు.