హైదరాబాద్లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం

హైదరాబాద్లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం

హైదరాబాద్ లో మరో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. మైలర్ దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో పరిధిలో అయాన్ అనే బాలుడు మిస్సింగ్ అయ్యాడు. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడిని గుర్తు తెలియని వ్యక్తి కిడ్నాప్ చేశాడని చెబుతున్నారు. ఐదేళ్ల అయాన్ ఇంటి ముందు ఆడుకుంటూ ఎక్కడకో వెళ్లిపోయాడని బాలుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయాన్ ఇంటి నుండి నడుచుకుంటూ వెళ్తున్న సీసీ ఫుటేజీని పరిశీలించారు పోలీసులు. ఈ కేసును చాలా సీరియస్ గా తీసుకున్న పోలీసులు అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. 

ఇక ఇవాళ (సెప్టెంబర్ 30న) ఉదయం మరో బాలుడిని కిడ్నాప్ చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో కిడ్నాప్ కు గురైన ఐదేళ్ల బాలుడి కేసును ఛేదించారు జీఆర్పీ పోలీసులు. కొన్నిగంటలో బాలుడి ఆచూకీని కనిపెట్టారు.సైబర్ టవర్స్ వద్ద బాలుడిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు.