హైదరాబాద్ , వెలుగు: పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్ లు, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు గడువును ప్రభుత్వం మరోసారి పెంచింది. ఈ నెల 15వ తేదీ వరకు అప్లై చేసుకు నేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు స్పెషల్ సీఎస్ అజయ్ మిశ్రా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి 2019 ఆగస్టుతో గడువు ముగియాల్సింది.
కానీ ఆశించిన స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో సెప్టెంబర్ నెలాఖరు వరకు పొడిగించారు. అయినా పెద్దగా అప్లికేషన్లు రాకపోవడంతో డిసెంబర్ 31 వరకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఈ –పాస్ వెబ్ సైట్ను క్లోజ్ చేశారు. ఇంకా అనేక మంది స్టూడెంట్లు అప్లై చేసుకోకపోవడంతో ప్రభుత్వానికి విజ్ఞప్తులు వచ్చాయి. దీంతో వెబ్ సైట్ను ఓపెన్ చేశారు.