అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

మంచిర్యాల (దండేపల్లి), వెలుగు: అప్పుల బాధతో మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం లక్ష్మీకాంతపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శనివారం అర్ధరాత్రి జరిగింది. పోలీసులు, కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన అప్పాల నారాయణ (45) ఉపాధి కోసం మూడేండ్ల క్రితం దుబాయి వెళ్లాడు. కరోనా పరిస్థితుల కారణంగా పోయినేడాది తిరిగి సొంత ఊరు వచ్చాడు. అప్పటినుంచి తనకున్న మూడెకరాల పొలంలో వరి సాగు చేస్తూ జీవిస్తున్నాడు. పంట పెట్టుబడికి, దుబాయి వెళ్లేందుకు సుమారు రూ.5 లక్షలు అప్పు చేశాడు. వ్యవసాయంలో అనుకున్న దిగుబడి రాక, మళ్లీ విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు లేక, చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక మనస్తాపం చెందేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నారాయణ భోజనం చేసి పడుకున్నాడు. అందరూ పడుకున్న తరువాత ఇంటిముందు ఉన్న రేకుల షెడ్డులో దూలానికి వైరుతో ఉరేసుకున్నాడు. నారాయణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య భూలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఐ సాంబమూర్తి తెలిపారు.