లారీని ఢీకొట్టిన మరో లారీ.. ముగ్గురి మృతి

లారీని ఢీకొట్టిన మరో లారీ.. ముగ్గురి మృతి

పెద్దపల్లి జిల్లా: గోదావరిఖని గంగానగర్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని మరో లారీ ఢీ కొట్టింది. దీంతో పక్కనే వెళ్తున్న ఆటోపై లారీ బోల్తా పడటంతో ముగ్గురు అక్కడిక్కడే చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్ర గాయలు అయ్యాయి. రాంనగర్ కు చెందిన షేక్ షకీల్ కుటుంబ సభ్యులు మంచిర్యాలలో  ఫంక్షన్ కు వెళ్తుండగా గంగానగర్ ఫ్లైఓవర్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. భార్యా భర్తలతో పాటు చిన్నారి అక్కడిక్కడే మృతి చెందింది. ప్రమాదంలో చిక్కుక్కున్న మరో చిన్నారిని పోలీసులు బయటకు తీశారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని హాస్పిటల్ కు తరలించారు.

 

ఇవి కూడా చదవండి

ఆన్​లైన్​ క్లాసులతో చదువులు ఆగమాగం

తెలంగాణ రాష్ట్రంలో ఒక్కో వ్యక్తిపై రూ.81,944 అప్పు

90 వేల ఎకరాలకు పురుగు తగిలింది

తాను చనిపోతూ.. ఏడుగురికి పునర్జన్మ