టోక్యో పారాలింపిక్స్ లో భారత్‌కు మరో మెడల్

టోక్యో పారాలింపిక్స్ లో భారత్‌కు మరో  మెడల్

టోక్యో పారాలింపిక్స్ లో భారత్ కు మరో పతకం లభించింది. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ SH1 విభాగంలో భారత షూటర్ సింగ్రాజ్ అధానా బ్రాంజ్ మెడల్ గెలిచాడు. ఫైనల్ లో 216.8 పాయింట్స్ సాధించిన సింగ్రాజ్ కాంస్య పతకం సాధించాడు. ఇదే ఈవెంట్ లో ఫైనల్ చేరిన మరో భారత షూటర్ తీవ్రంగా నిరాశపరిచాడు. అతను 135.8 పాయింట్స్ మాత్రమే సాధించి... ఏడో స్థానంలో నిలిచాడు.