దేశ వ్యాప్తంగా ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. నాలుగు రాష్ట్రాల్లో 19 ప్రాంతాల్లో ఒకేసారి ఎన్ ఐఏ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఉగ్రవాద కుట్ర కేసులో డిసెంబర్ 18 ఉదయం నుంచే కర్నాటకలోని 11, జార్ఖండ్లో నాలుగు, మహారాష్ట్రలో మూడు, ఢిల్లీలో ఒకచోట ఎన్ఐఏ సోదాలు చేస్తోంది.
వారం రోజుల క్రితం, కర్ణాటకలోని బెంగళూరులో దాదాపు ఆరు ప్రాంతాల్లో, మహారాష్ట్రలోని 40 చోట్ల దాడులు చేసి 15 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో లెక్కకు మించిన నగదు, ఆయుధాలు, కీలక పత్రాలు, ఇతర ఆయుధాలు,స్మార్ట్ ఫోన్లు, పలు డిజిటల్ పరికరాలను ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది.
దేశ వ్యాప్తంగా ఉగ్రదాడులకు పాల్పడేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కుట్ర పన్నిందన్న సమాచారంతోనే జాతీయ సంస్థ ఈ దాడులు చేపడుతుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
National Investigation Agency (NIA) is conducting searches at 19 locations in South India by busting a highly radicalised Jihadi terror group pic.twitter.com/oYnsKJjnaW
— ANI (@ANI) December 18, 2023