‘అఆ’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అనుపమ పరమేశ్వరన్.. వరుస సినిమాలతో తెలుగువారికి బాగానే దగ్గరయ్యింది. ప్రస్తుతం నిఖిల్తో కలిసి కార్తికేయ2, 18 పేజెస్ సినిమాలు చేస్తోంది. వీటిలో ముందుగా ‘కార్తికేయ2’ విడుదల కాబోతోంది. జులై 22న ఈ మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తోంది అనుపమ. పోస్ట్ ప్రొడక్షన్తో పాటు ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అనుపమ తన డబ్బింగ్ వర్క్ని కూడా కంప్లీట్ చేసేసింది. ఆ విషయాన్ని తనే ఇటీవల సోషల్ మీడియాలో చెప్పింది. అయితే ఆమె మలయాళ వెర్షన్ని డబ్బింగ్ చెప్పినట్టు రివీల్ చేసింది.
చందు మొండేటి రూపొందిస్తున్న ఈ మూవీని తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లోనూ విడుదల చేస్తున్నారు. అనుపమ మలయాళీ కావడంతో ఆ భాషలో తనే డబ్బింగ్ చెప్పుకుంది. తెలుగులో కూడా చాలాకాలంగా అనుపమే మాట్లాడుకుంటోంది. మరి మిగతా భాషల్లో కూడా తనే చెప్పుకుంటుందో లేక ఇంకెవరైనా తనకి వాయిస్ ఇస్తారో చూడాలి. మరోవైపు ‘18 పేజెస్’ మూవీ కూడా రిలీజ్కి రెడీ అవుతోంది. త్వరలోనే డేట్ని అనౌన్స్ చేయనున్నారు. వీటితో పాటు గంటా సతీష్ బాబు దర్శకత్వంలో ‘బటర్ఫ్లై’ అనే ఫిమేల్ ఓరియెంటెడ్ మూవీలోనూ నటిస్తోంది అనుపమ.