రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్ ఆగ్రహం

రాహుల్ గాంధీపై కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్ ఆగ్రహం

సుప్రీం కోర్టు నియమించిన టెక్నికల్ కమిటీకి రాహల్ ​గాంధీ, ఇతర కాంగ్రెస్​ నేతలు తమ ఫోన్లను ఎందుకు సమర్పించలేదని కేంద్రమంత్రి అనురాగ్​ ఠాకూర్​ ప్రశ్నించారు. యూకే కేంబ్రిడ్జి వర్సిటీలో రాహుల్​చేసిన పెగాసస్​వ్యాఖలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెగాసస్​పై రాహుల్ ప్రతిసారీ అసత్యాలు చెబుతున్నారని విమర్శించారు. 

దేశాన్ని కించపరిచే కుట్రను కాంగ్రెస్​ తెరతీసిందని అభిప్రాయాన్ని అనురాగ్​ ఠాకూర్ వ్యక్తం చేశారు. రీసెంట్​అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయం సాధించలేదని రాహుల్​కు తెలుసునని, దీంతో ఇలాంటి అవాస్తవ ఆరోపణలను చేస్తున్నారని నిందించారు. ప్రధాని మోడీ నాయకుడిగా ఎదిగారని, రాహుల్, కాంగ్రెస్​ పార్టీ ఎన్నికల్లో ఓడిపోతుందని పేర్కొన్నారు.