
నవంబర్ 19న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతోన్న వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్కు హాజరైన నటి అనుష్క శర్మ ప్రింటెడ్ డ్రెస్లో స్టైలిష్గా కనిపించింది. కుమార్తె వామికతో కలిసి అహ్మదాబాద్కు చేరుకున్న దివా.. ఇండియాకు, అలాగే తన భర్త విరాట్ కోహ్లీకు సపోర్ట్ చేసేందుకు ఉత్సాహంగా కనిపించింది. మ్యాచ్ కోసం, అనుష్క మరోసారి బ్రీజీ బ్లూ అండ్ వైట్ ప్రింటెడ్ డ్రెస్లో కంఫర్ట్ గా కనిపించి.. అందర్నీ ఆకర్షించింది.
తెల్లటి దుస్తులపై నీలం రంగులో ఉన్న సీతాకోకచిలుకలు, చెట్లు అనుష్క శర్మకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. దీంతో అందరి దృష్టి ఆమె వేసుకున్న ఆ డ్రెస్ పై పడింది. ఇది ఎంత ధర ఉండొచ్చు అంటూ ఆమె అభిమానులు ఆన్ లైన్ లో సెర్చ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా వెల్లడైన విషయమేమిటంటే.. ఈ బ్రీజీ బ్లూ అండ్ వైట్ ప్రింటెడ్ డ్రెస్ ధర రూ.7,250 ఉన్న ఓ ఆన్ లైన్ ప్లాట్ ఫారమ్ చూపించింది. బ్రాండ్ వెబ్సైట్లోని వివరణ ప్రకారం, దుస్తులలో పాకెట్స్ కూడా ఉన్నాయి.
ఇక అనుష్క ప్రపంచ కప్ ఫైనల్ లుక్ విషయానికొస్తే, ఆమె తక్కువ మేకప్ తోనే స్టైల్ గా కనిపించింది. ఇదిలా ఉండగా షారుఖ్ ఖాన్, దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ వంటి పలువురు ప్రముఖులు కూడా ఈ మ్యాచ్ చూసేందుకు అహ్మదాబాద్ చేరుకున్నారు.