4న ఏపీ కేబినెట్ భేటీ

4న ఏపీ కేబినెట్ భేటీ

వచ్చే నెల 4న  ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై చర్చించనున్నారు. అలాగే  రాజధాని మార్పుపై వస్తున్న ఊహాగానాలపై ఈ భేటీ తర్వాత క్లారిటీ రానుంది. అలాగే పోలవరం రివర్స్ టెండర్స్ ఆమోదంపై భేటీలో చర్చించనున్నారు. ఇప్పటికే రోజుకో శాఖతో సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్న జగన్ ఇంకా పలు కీలక అంశాలపై చర్చించనున్నారని తెలుస్తోంది.