రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

రేపు జరగాల్సిన ఏపీ కేబినెట్ భేటీ వాయిదా

అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన రేపు జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై చర్చించేందుకు రేపు ఉదయం 11 గంటలకు సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. అనూహ్యంగా సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఒక ప్రకటనలో తెలియజేశారు. తిరిగి ఎప్పుడు నిర్వహించేది తర్వాత తెలియజేస్తానని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.