ఈనెల 8న కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం

ఈనెల 8న కొలువుదీరనున్న ఏపీ మంత్రివర్గం

ఈ నెల 8వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్గం కొలువుదీరనుంది. ప్రమాణస్వీకారానికి గాను అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు… గురువారం అమరావతి సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ఆ రాష్ట్ర సీఎస్ ఎల్ వీ సుబ్రహ్మణ్యం సమావేశం నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సజావుగా జరిగేలా విస్తృతమైన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమానికి ఐదువేల మందికి పైగా హాజరవనున్నారని ఆయన తెలిపారు.

8వ తేదీ పొద్దున11గం.ల 49ని.లకు మంత్రివర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరుగునుందని సీఎస్ తెలిపారు. ఏపీ సీఎం జగన్, రాష్ట్ర గవర్నర్ నరసింహన్ సభావేదిక దగ్గరకు 11గం.ల 45 నిమిషాలకు చేరుకుంటారని చెప్పారు. ఇప్పటికే కార్యక్రమానికి హాజరుకానున్న వారికి పాస్ లు ప్రింట్ చేసి ఇచ్చామని తెలిపారు.