కేసీఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్

కేసీఆర్ ను పరామర్శించనున్న ఏపీ సీఎం జగన్

ఏపీ సీఎం జగన్ జనవరి 4న హైదరాబాద్ రానున్నారు. మోకాలికి శస్త్రచికిత్స అయిన మాజీ సీఎం కేసీఆర్ ను జూబ్లీహిల్స్ లోని ఆయన ఇంట్లో  పరామర్శించనున్నారు. కేసీఆర్ ను సీఎం రేవంత్ రెడ్డి, పలవురు మంత్రులు, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు సహా పలువురు నేతలు పరామర్శించారు. అయితే జగన్ రేపు పరామర్శించనున్నారు. 

 ఎర్రవెల్లిలోని ఫామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో డిసెంబర్ 7న అర్ధరాత్రి ప్రమాదవశాత్తు జారిపడటంతో కేసీఆర్ ఎడమ కాలి తుంటి ఎముక విరిగిన సంగతి తెలిసిందే. అదే రోజు రాత్రి కుటుంబ సభ్యులు సోమాజిగూడలోని యశోద హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తరలించారు. 8న సాయంత్రం ఆయనకు సీనియర్ డాక్టర్ల బృందం హిప్ రీప్లేస్​మెంట్ సర్జరీ చేసింది.

 డిసెంబర్ 15 శుక్రవారం ఉదయం యశోద హాస్పిటల్ నుంచి కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. మెడికల్ ఫాలో అప్, ఫిజియోథెరపీ కోసం తరచూ డాక్టర్ల బృందం వచ్చి వెళ్లేందుకు వీలుగా బంజారాహిల్స్   నందినగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని  తన ఇంట్లోనే ఉంటున్నారు . కేసీఆర్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా 3 నుంచి 4 వారాల టైం పడుతుంది