చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్

చంద్రబాబుపై జగన్ సంచలన కామెంట్స్

నంద్యాల: ప్రతిపక్షాలు, కొన్ని మీడియా సంస్థలపై సీరియస్ అయ్యారు ఏపీ సీఎం జగన్. శుక్రవారం నంద్యాల జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. దౌర్భాగ్య ప్రతిపక్షం, దౌర్భాగ్య మీడియా, దౌర్భాగ్య దత్తపుత్రుడు ఉండటం ఈ రాష్ట్రం చేసుకొన్న ఖర్మ అన్నారు. పిల్లలకి ఇచ్చే చిక్కీపై సీఎం బొమ్మ ఉందంటూ చిల్లర రాజకీయాలతో రాద్ధాంతం చేస్తున్న ఘనత చంద్రబాబునాయుడు, ఎల్లో మీడియాదే అన్నారు. దేవుడి దయ, ప్రజల చల్లని దీవెనలతో ఈ స్థానానికి వచ్చానన్న జగన్... వీళ్ళందరూ కలిసి నా వెంట్రుక కూడా పీకలేరు అంటూ సంచలన కామెంట్స్ చేశారు ఏపి సీఎం వైఎస్ జగన్. 

ఎల్లో పార్టీ కడుపు మంట, అసూయకు మందే లేదని.. చివరికి పిల్లలకు అందుతున్న సంక్షేమ పథకంపై కూడా అక్కసు వెల్లగక్కుతున్నారని తెలిపారు. గత ప్రభుత్వం హయాలంలో తక్కువగా ఉన్నజీఈఆర్‌ రేషియో, ప్రభుత్వ బడులలో చదువుతున్న పిల్లల సంఖ్యను.. పెంచిన ఘనతను తమ ప్రభుత్వానిదేనని, ఇది గమనించమని ప్రజలను కోరారు సీఎం జగన్‌.

మరిన్ని వార్తల కోసం

సర్ఫ్, నూనె, కెమికల్స్​తో పాల తయారీ

పెళ్లికి పెట్రోల్, డీజిల్ బాటిళ్లు గిఫ్ట్ గా ఇచ్చిన ఫ్రెండ్స్