అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతోంది. గత పాతిక రోజులుగా తగ్గుముఖం పడుతున్న విషయం తెలిసిందే. ఇవాళ కూడా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. గడచిన 24గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలో 18 వేల 915 మందికి పరీక్షలు చేయగా.. 280 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. అలాగే చిత్తూరు జిల్లాలో ఒకరు, నెల్లూరు జిల్లాలో మరొకరు చొప్పున కరోనా నుంచి కోలుకోలేక మృతి చెందారు. జిల్లాల వారీగా చూస్తే అత్యధికంగా తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో 44 చొప్పున కేసులు నమోదు కాగా అతి తక్కువగా విజయనగరం జిల్లా, కర్నూలు జిల్లాలో ఒక్కొక్క కేసులు మాత్రమే నమోదయ్యాయి. జిల్లాల వారీగా నమోదైన కొత్త కేసుల వివరాలు కింది పట్టికలో చూడండి..
ఇవి కూడా చదవండి
సినిమా బాగుంటే చూస్తారు..లేకపోతే మరో అజ్ఞాతవాసి
ఉక్రెయిన్లో భారతీయుల కోసం టీబీజేపీ టోల్ ఫ్రీ నెంబర్