విభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి

విభజన వల్ల నష్టపోయాం.. ప్రత్యేక హోదా ఇవ్వండి
  • నీతి ఆయోగ్ సమావేశంలో మోడీని కోరిన జ‌గ‌న్

అమరావతి: ఉమ్మడి రాష్ట్రాన్ని విభజన చేయడం వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయిందని.. ప్రత్యేక హోదా ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి జగన్ ప్రధాని మోడీని కోరారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ పాల‌క మండ‌లి వ‌ర్చువ‌ల్ విధానంలో నిర్వహించిన  నీతి అయోగ్ సమావేశంలో జగన్ మాట్లాడుతూ రాష్ట్ర విభ‌జన వ‌ల్ల ఏపీ నష్టపోయిందని, హోదా ఇస్తామని అప్ప‌ట్లో పార్లమెంట్‌లో ప్రకటన చేశారని గుర్తు చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తేనే రాష్ట్రం పారిశ్రామిక అభివృద్ధిని వేగ‌వంతంగా సాధిస్తుంద‌ని చెప్పారు. పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలపై ఏపీ స‌ర్కారు ఏడాదికి 10 నుంచి 11 శాతం వడ్డీలను చెల్లించాల్సి వస్తోందని అలాగే, రుణాలపై అధిక వడ్డీలతో పాటు విద్యుత్‌ ఖర్చులు ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వానికి భారంగా మారాయ‌ని తెలిపారు. కేంద్ర ప్ర‌భుత్వం నిర్దేశించిన సంస్కరణల విషయంలో ఏపీ స‌ర్కారు స‌మ‌ర్థంగా ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఐదు రకాల చర్యలను చేపట్టాల్సి ఉంటుందని తెలిపారు. పంటల ఉత్పత్తి ఖర్చును తగ్గించాల‌ని ఆయ‌న చెప్పారు. పంటల స్టోరేజీ, గ్రేడింగ్‌, ప్రాసెసింగ్‌ లో కొత్త సాంకేతిక‌తను ప‌రిచయం చేయాల‌ని జగన్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

లాక్‌డౌన్‌తో కంటి రోగులు ఐదింతలు పెరిగారు

టీఆర్ఎస్‌ని ఎలా ఎదుర్కొవాలి? 11 ప్రశ్నల ఫీడ్‌బ్యాక్ ఫామ్ ఇచ్చిన షర్మిల

మార్స్‌పై సేఫ్‌గా దిగి ఫోటో పంపిన నాసా రోవర్