AP ఎంసెట్ ఫలితాలు విడుదల

AP ఎంసెట్ ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్ లో ఇంజినీరింగ్ అగ్రికల్చరల్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – EACMET ఫలితాలు విడుదలయ్యాయి. ఉన్నత విద్యామండలి ముఖ్య కార్యదర్శి విజయరాజు ఈ ఉదయం రిజల్ట్ ప్రకటించారు. తెలంగాణ, ఏపీ నుంచి మొత్తం 2,82,711 మంది అభ్యర్థులు ఎంసెట్ కు అటెండయ్యారు.  ఇంజినీరింగ్ లో 74.39%, అగ్రికల్చర్ విభాగంలో 83.64% రిజల్ట్ వచ్చింది.

ఇంజినీరింగ్ లో పులిశెట్టి రవిశ్రీ తేజ టాపర్ గా నిలిచాడు. వేద ప్రణవ్ రెండో ర్యాంక్ సంపాదించాడు. 

మెడికల్ లో సుంకర సాయి స్వాతి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ దక్కించుకుంది. అగ్రికల్చర్ లో సాయి స్వాతి టాపర్ గా నిలిచింది.