క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

క‌రోనా నుంచి కోలుకున్న ఏపీ గవర్నర్ బిశ్వ‌భూష‌ణ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్  విశ్వభూషణ్ హ‌రిచంద‌న్ ..క‌రోనా నుంచి కోలుకున్నారు. ఇవాల హైద‌రాబాద్ నుంచి ప్ర‌త్యేక విమానంలో విజ‌య‌వాడ చేరుకున్నారు బిశ్వ‌భూష‌ణ్. లేటెస్టుగా ఆయనకు నిర్వహించిన RTPCR పరీక్షలో కరోనా నెగెటివ్ గా తేలినట్లు తేలిందని రాజ్ భవన్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదుటపడుతోందని ఏఐజీ ఆస్పత్రికి చెందిన ఉన్నత స్థాయి  వైద్యుల బృందం విడుదల చేసిన నివేదికలో తెలిపారు. 

ఈ నెల 17న ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ చేరుకున్న బిశ్వభూషణ్‌ హరిచందన్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించారు. ఆయన స్వల్ప దగ్గు, జలుబుతో బాధపడుతున్నందున ముందు జాగ్రత్త చర్యగా RTPCR పరీక్ష చేయించారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడతొ గవర్నర్‌ను హైదరాబాద్‌లోని గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రికి తరలించారు.