పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?

 పుస్తకాన్ని బ్యాన్ చేయకుండా నాటకాన్ని ఎలా బ్యాన్ చేస్తారు?
  • ఒక్క పాత్రపై అభ్యంతరం ఉంటే మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారు..?

అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  చింతామణి నాటక ప్రదర్శనను ప్రభుత్వం నిషేధించడంపై ఏపీ హైకోర్ట్‌ ఆగ్రహహం వ్యక్తం చేసింది. నిషేధాన్ని సవాల్ చేస్తూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. నిషేధాన్ని సవాల్ చేస్తూ.. దాఖలైన వాజ్యం తరపున సీనియర్ న్యాయవాది ఉమేష్‌ చంద్ర వాదనలు వినిపించారు.వాదనల సందర్భంగా చింతామణి పుస్తకాన్ని బ్యాన్ చేశారా అని హైకోర్టు ప్రశ్నించగా  పుస్తకాన్నినిషేధించలేదని న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

పుస్తకాన్ని నిషేధించకుండా నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం  ప్రశ్నించింది. నాటకంలో పాత్రపై అభ్యంతరం ఉంటే పాత్రను తొలగించాలి కానీ..మొత్తం నాటకాన్ని ఎలా నిషేధిస్తారని ధర్మాసనం ప్రశ్నించింది.  ఆర్య వైశ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారన్న వాదనను ఆలకించిన ధర్మాసనం.. వారు ఇచ్చిన విజ్ఞాపన పత్రాన్ని కోర్టు ముందుంచాలని ఆదేశాలు జారీ చేసింది.  ప్రభుత్వం, ఇతర అధికారులు అందరూ కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.