ఆయన పవన్ కళ్యాణ్ కాదు.. కిరాయి కోటిగాడు: ఏపీ మంత్రి అంబటి

ఆయన పవన్ కళ్యాణ్ కాదు.. కిరాయి కోటిగాడు: ఏపీ మంత్రి అంబటి

 జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. పీకే అంటే పవన్ కల్యాణ్ కాదు అని కేకే అని ఆరోపించారు. కేకే అంటే కిరాయి కోటిగాడు అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఇటీవల ఖమ్మంలో తనపై కొందరు టీడీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనపై పవన్ కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. టీడీపీ నుంచి కిరాయి తీసుకుంటాడు కాబట్టే ఖండించడని అన్నారు. ప్రగల్భాలు పలికే పవన్ కల్యాణ్ చంద్రబాబును ఏమైనా అంటే మాత్రం రోడ్డుమీదకు వచ్చి పడుకుంటాడని మండిపడ్డారు. గతంలోనూ ముద్రగడ పద్మనాభంపై దాడి జరిగినా పవన్ కల్యాణ్ ఖండించలేదని గుర్తు చేశారు. ఇకపోతే ఖమ్మంలో తనపై దాడి వెనుక పెద్ద కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనపై జరిగిన దాడి యత్నం చిన్నదిగా చూడొద్దంటూ... దీని వెనుక పెద్ద కుట్ర జరుగుతోంది. తనను భౌతికంగా తొలగించాలని  దాడికి యత్నించిన వారిలో తొమ్మిది మందిని గుర్తించారని తెలిపారు. వారిలో ఆరుగురుని అరెస్ట్‌ చేశారు. వారంతా ఒకే సామాజిక వర్గానికి చెందిన వారని ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు.