
దేశ వ్యాప్తంగా పలువురు హైకోర్టు చీఫ్ జస్టిస్ లు, న్యాయమూర్తులు బదిలీ అయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాలకు కొత్త చీఫ్ జస్టిస్ (CJ)లు నియమితులయ్యారు. ఈనెల 14న జరిగిన సుప్రీంకోర్టు కొలీజియం సమావేశంలో దీనికి సంబంధించి ఖరారు చేసినట్లు ప్రకటన విడుదలైంది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు CJగా జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, తెలంగాణ హైకోర్టు CJ గా జస్టిస్ హిమా కోహ్లీ నియమితులయ్యారు. ప్రస్తుతం ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జస్టిన్ కేకే మహేశ్వరిని సిక్కింకు బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ హైకోర్టు CJ గా ఉన్న ఆర్.ఎస్.చౌహాన్ ను ఉత్తరాఖండ్ కు బదిలీ చేశారు. ఒడిశా హైకోర్టు సీజే జస్టిస్ మహమ్మద్ రఫీక్ ను మధ్యప్రదేశ్ కు బదిలీ అయ్యారు. వీరితో పాటు జమ్మూకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజేశ్ బిందాల్ కోల్కతాకు, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినీత్ కొరారి గుజరాత్ కు, మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్ర శర్మ కర్ణాటకకు బదిలీ చేశారు. కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జోయ్ మాల్యా బాగీని ఏపీ పైకోర్టుకు బదిలీ అయ్యారు.