పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్స్

పంజాబ్ నేషనల్ బ్యాంకులో మేనేజర్స్

న్యూఢిల్లీలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌‌బీ) దేశ వ్యాప్తంగా వివిధ శాఖల్లో మేనేజర్, ఆఫీసర్ ఖాళీల భర్తీకి ఆఫ్‌‌లైన్‌‌ దరఖాస్తులు కోరుతోంది. ఆఫీసర్ (ఫైర్- సేఫ్టీ)(జేఎంజీఎస్‌‌-1 గ్రేడ్) ద్వారా 23 పోస్టులు, మేనేజర్ (సెక్యూరిటీ)(ఎంఎంజీఎస్‌‌-2 గ్రేడ్) ద్వారా 80 పోస్టులను భర్తీ చేయనున్నారు. 

అర్హత: బ్యాచిలర్ డిగ్రీ, బీఈ(ఫైర్), బీఈ, బీటెక్‌‌(ఫైర్ టెక్నాలజీ/ ఫైర్ ఇంజినీరింగ్/ సేఫ్టీ అండ్ ఫైర్ ఇంజినీరింగ్‌‌) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 21 నుంచి- 35 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి. రాత/ ఆన్‌‌లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.59, మిగతా అభ్యర్థులకు రూ.1003 అప్లికేషన్​ ఫీజు చెల్లించాలి.

దరఖాస్తులు: ఆఫ్‌‌లైన్‌‌ దరఖాస్తులను చీఫ్ మేనేజర్ (రిక్రూట్‌‌మెంట్ విభాగం), హెచ్‌‌ఆర్‌‌డీ డివిజన్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కార్పొరేట్ ఆఫీస్, ప్లాట్ నెం.4, సెక్టార్ 10, ద్వారక, న్యూఢిల్లీ చిరునామాకు స్పీడ్/ రిజిస్టర్డ్ పోస్టు ద్వారా ఆగస్టు 30 వరకు ఆఫ్​లైన్​ ద్వారా అభ్యర్థులు తమ దరఖాస్తులు సంబంధిత అడ్రస్​కు పంపాలి. పూర్తి సమాచారం కోసం www.pnbindia.in వెబ్​సైట్​లో సెర్చ్​ చేయాలి.