హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలోని ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్ కు దరఖాస్తులు భారీగానే వస్తున్నాయి. అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 1న ప్రారంభం కాగా.. ఆదివారం సాయంత్రానికి 26,582 మంది దరఖాస్తు చేసుకున్నా రు.
మూడేండ్ల ఎల్ఎల్బీ కోర్సు కోసం 18,622, ఐదేండ్ల ఎల్ఎల్బీ కోర్సుకు 5,665, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుకు 2,295 దరఖాస్తులు అందాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలి పారు. షెడ్యూల్ ప్రకారం ఎలాంటి ఫైన్ లేకుండా సోమవారం వరకూ అభ్యర్థు లు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. .
దర ఖాస్తు గడువు పెంచాలనే విజ్ఞప్తులపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. జూన్ 3న లాసెట్ ఎగ్జామ్ జరగనుంది.