టీఎస్ లాసెట్ కు 26,582 అప్లికేషన్లు..దరఖాస్తుకు ఇవ్వాలె ఆఖరు 

టీఎస్ లాసెట్ కు 26,582 అప్లికేషన్లు..దరఖాస్తుకు ఇవ్వాలె ఆఖరు 

హైదరాబాద్, వెలుగు :  రాష్ట్రంలోని ఎల్​ఎల్​బీ, ఎల్ఎల్ఎం కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే టీఎస్ లాసెట్ కు దరఖాస్తులు భారీగానే వస్తున్నాయి. అప్లికేషన్ల ప్రక్రియ మార్చి 1న ప్రారంభం కాగా.. ఆదివారం సాయంత్రానికి 26,582 మంది దరఖాస్తు చేసుకున్నా రు.

మూడేండ్ల ఎల్​ఎల్​బీ కోర్సు కోసం 18,622, ఐదేండ్ల ఎల్​ఎల్​బీ కోర్సుకు 5,665, రెండేండ్ల ఎల్ఎల్ఎం కోర్సుకు 2,295 దరఖాస్తులు అందాయని లాసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ విజయలక్ష్మి తెలి పారు. షెడ్యూల్​ ప్రకారం ఎలాంటి ఫైన్ లేకుండా సోమవారం వరకూ అభ్యర్థు లు అప్లై చేసుకోవచ్చని చెప్పారు. .

దర ఖాస్తు గడువు పెంచాలనే విజ్ఞప్తులపై ఉన్నతాధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.  జూన్ 3న లాసెట్ ఎగ్జామ్ జరగనుంది.