తెలంగాణలో లోక్సభ నియోజకవర్గాలకు బీజేపీ ఇన్ఛార్జులను నియమించింది. వీరిలో 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి ఇన్ఛార్జులుగా బీజేపీ స్టేట్ చీఫ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి బాధ్యతలు అప్పగించారు. పార్టీలోని కీలక నేతలైనా బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, డీకే అరుణ, కిషన్ రెడ్డి, కొండా విశ్వేశ్వర్ రెడ్డిలకు ఏ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించకలేదు.
- ఆదిలాబాద్ - పాయల్ శంకర్
- పెద్దపల్లి - రామారావు పటేల్
- కరీంనగర్ - ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
- నిజామాబాద్ - ఏలేటి మహేశ్వర్ రెడ్డి
- జహీరాబాద్ - కాటిపల్లి వెంకటరమణారెడ్డి
- మెదక్ - హరీష్ బాబు
- మల్కాజ్గిరి - పైడి రాకేశ్ రెడ్డి
- సికింద్రాబాద్ - డాక్టర్ కే.లక్ష్మణ్
- హైదరాబాద్ - రాజాసింగ్
- చేవెళ్ల - వెంకట నారాయణ రెడ్డి
- మహబూబ్నగర్ - రామచందర్ రావు
- నాగర్కర్నూలు - రంగారెడ్డి
- నల్లగొండ - చింతల రామచంద్రా రెడ్డి
- భువనగిరి - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్
- వరంగల్ - మర్రి శశిధర్ రెడ్డి
- మహబూబాబాద్ - గరికపాటి మోహన్ రావు
- ఖమ్మం - పొంగులేటి సుధాకర్ రెడ్డి
- ALSO READ | బీ అలర్ట్ : అభయ హస్తం పేరుతో ఫోన్లు.. OTP చెప్పాలంటూ సైబర్ ఎటాక్