తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ఐదు గ్యారెంటీల అమలు కోసం ప్రజాపాలన పేరుతో ప్రజల నుంచి అభయహస్తం దరఖాస్తులు స్వీకరించింది. 2023 డిసెంబర్ 28 నుంచి 2024 జనవరి 6 వరకు పది రోజుల పాటు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. రాష్ట్రవ్యాప్తంగా.. పది రోజుల్లో మొత్తం కోటీ 25 లక్షలకు పైచిలుకే దరఖాస్తులు వచ్చాయి.
అయితే ఈ 5 గ్యారంటీల కోసం అప్లై చేసుకున్న వారిని లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు ఇప్పుడు టార్గెట్ చేశారు. లబ్దిదారులకు ఫోన్ చేసి మీకు ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డు, గ్యాస్ సిలిండర్ మంజూరు అయిందని చెప్తూ, మీ ఫోన్ నెంబర్కు ఓటీపీ వస్తుందని ఓటీపీ చెప్పాలంటూ కొత్తరకం మోసాలకు పాల్పడుతున్నారు. ఎంతో కొద్దీగా అకౌంట్లో దాచుకున్న డబ్బులను దోచుకుంటున్నారు.
అయితే ఇలాంటి ఫేక్ కాల్స్ తో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు పోలీసులు. ఎవరికీ కూడా ఓటీపీలు షేర్ చేయోద్దని అలర్ట్ చేస్తున్నారు. ఇక నిన్నటి వరకు అభయహస్తం తీసుకున్న దరఖాస్తులను అధికారులు వాటిని ప్రస్తుతం ఆన్లైన్లో ప్రత్యేక సాఫ్ట్ వేర్లో ఎంటర్ చేసే ప్రక్రియ మొదలు పెట్టారు. ఈ ప్రక్రియ ముగిసిన తర్వాత అందులోని అర్హుల జాబితాను సిద్ధం చేయనున్నారు.
ప్రజాపాలన కోసం కాంగ్రెస్ సర్కార్ ప్రత్యేకంగా ఓ వైబ్ సైట్ ను రూపొందించింది. ఈ వైబ్ సైట్(www.prajapalana.telangana.gov.in) ను సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. ప్రతి 4 నాలుగు నెలలకోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.