- మరో నలుగురికి మీడియా మేనేజ్మెంట్ కమిటీలో చోటు
హైదరాబాద్, వెలుగు: బీజేపీ అధికార ప్రతినిధులుగా ఆరుగురు నాయకులకు అవకాశం దక్కింది. ఈ మేరకు కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి సోమవారం ఆదేశాలు జారీ చేశారు.
అధికార ప్రతినిధులుగా నియమితులైన వారిలో రిటైర్డ్ ఐపీఎస్ కృష్ణ ప్రసాద్, అమర్ నాథ్, కల్యాణ్ నాయక్, శ్రీనివాస్ నాయక్, విజయ సునీత, జి.వెంకటరెడ్డి ఉన్నారు. సినీ ఆర్టిస్ట్ కస్తూరి, విజిత్ కుమార్, సుంకర మౌనిక, రాణా ప్రతాప్ను మీడియా మేనేజ్ మెంట్ నేతలుగా కిషన్ రెడ్డి నియమించారు.