కమిషన్ ను ఆశ్రయిస్తే న్యాయం చేస్తాం

కమిషన్ ను ఆశ్రయిస్తే న్యాయం చేస్తాం

ముషీరాబాద్, వెలుగు: సమస్యలు ఎవరికైనా వస్తాయి తమ వద్దనే ఉంచుకుంటే సమస్య పరిష్కారం కాదని మానవ హక్కుల కమిషన్ ను ఆశ్రయిస్తే వారికి న్యాయం చేస్తామని  కమిషన్ చైర్మన్ జస్టిస్ జి.చంద్రయ్య అన్నారు. ఆదివారం బాగ్ లింగంపల్లి లోని అంబేద్కర్ కళాశాలలో ఎల్డర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ వ్యవస్థాపక దినోత్సవం జరిగింది.  ముఖ్య అతిథులుగా జస్టిస్ చంద్రయ్య, ఏపీహైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజని హాజరయ్యారు. జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ ప్రజల హక్కులను కాపాడేందుకు చిత్తశుద్ధితో పని చేస్తామని తెలిపారు. కమిషన్ ను ఆశ్రయించిన అందరి సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎల్డర్స్ క్లబ్ ఏర్పడిన కొద్దికాలంలోనే ప్రాచుర్యం పొందినన్నారు.

ఇప్పటికే 10 వేల మంది సభ్యులు చేరడం అభినందనీయమన్నారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రజని మాట్లాడుతూ మానవ హక్కుల కమిషన్ చిన్నపిల్లల అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మందడి కృష్ణా రెడ్డి, మాజీ ఐపీఎస్  గోపీనాథ్ రెడ్డి, రవికుమార్, డాక్టర్ ఎస్.ఆవులప్ప, డాక్టర్.హనుమంతరావు, వేముల గౌరీశంకర్, డాక్టర్ సుదర్శన్ రావు, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.