ఇంత జరుగుతుంటే.. పోలీసులు నిద్ర పోతున్నారా

ఇంత జరుగుతుంటే.. పోలీసులు నిద్ర పోతున్నారా

ఢిల్లీలో బీజేపీ గెలిచిన ప్రాంతాల్లోనే ఎందుకు అల్లర్లు జరిగాయని ప్రశ్నించారు కాంగ్రెస్ ఎంపీ కపిల్ సిబల్. దేశ రాజధానిలో ఇంత హింస జరుగుతోంటే.. కేంద్ర హోంమంత్రి, ఢిల్లీ పోలీస్ కమిషనర్ ఏం చేస్తున్నారన్నారు. ఢిల్లీ లా అండ్ ఆర్డర్ కేంద్రం చేతుల్లోనే ఉందని.. అలాంటప్పుడు.. ఇంత విధ్వంసం జరుగుతోంటే చూస్తూ ఉండిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైలెంట్ గా ఉండాలని పోలీసులకు ఎవరైనా ఆదేశాలిచ్చారా..? అని ప్రశ్నించారు.