ఆర్మూర్, వెలుగు : ఆర్మూర్ టౌన్లోని ప్రసిద్ధ నవనాథ సిద్ధుల గుట్టను సోమవారం భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. గుట్టపైన ఉన్న శివాలయం, రామాలయం, అయ్యప్ప, దత్తాత్రేయ మందిరాల్లో పురోహితులు నందీశ్వర మహారాజ్, కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, అభిషేకాలు జరిగాయి.
ఈ సందర్భంగా రామాలయం నుంచి జీవ కోనేరు వరకు ఉత్సవ మూర్తులతో పల్లకీ సేవ జరిగింది. భక్తులు భజన కీర్తనలు చేశారు. అనంతరం రాజస్థాన్ స్వీట్ హోమ్ అధినేత బన్సిలాల్ ఆధ్వర్యంలో అన్నదానం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో మందిర కమిటీ ప్రతినిధులు, నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
