నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​ రెడ్డి

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు :ఆర్మూర్​ ఏసీపీ వెంకటేశ్వర్​ రెడ్డి

ఆర్మూర్​, వెలుగు: నకిలీ విత్తనాలు, మందులు, ఎరువులు అమ్మితే కఠిన చర్యలు తప్పవని ఆర్మూర్​ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి హెచ్చరించారు. శనివారం ఆర్మూర్​లో సీడ్​దుకాణాలు, గోదాంలను ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఏవో హరికృష్ణ, సీఐ సత్యనారాయణగౌడ్​కలిసి తనిఖీ చేశారు. షాపుల్లో స్టాక్ రిజిస్టర్, డెలివరీ రిజిస్టర్, బిల్ బుక్ ఇతర రికార్టులు తనిఖీ చేసి షాప్ లో ఉన్నా సీడ్స్, ఫర్టిలైజర్ పరిశీలించారు. 

నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన విత్తనాలు, పురుగు మందులు అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులను మోసం చేయాలని చూసే షాపు యజమానులపై కఠినంగా వ్యవహరిస్తామని, రైతులు కూడా అప్రమత్తంగా ఉండి వ్యవసాయ అధికారులు సూచించిన విత్తనాలు కొనుగోలు చేయాలన్నారు. నకిలీ విత్తనాలు ఎవరైనా అమ్ముతున్నట్లు తెలిస్తే 100 కు సమాచారం అందించాలని సూచించారు.