జమ్మూ: రాజోరీ ఎన్ కౌంటర్ లో వీరమరణం పొందిన ఆర్మీ జవాన్ రవికుమార్ కు గురువారం ఉదయం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ వీడ్కోలు పలికారు. రవికుమార్ కిష్త్వార్ జిల్లాలోని కలిఘర్ లోని వస్నౌటి గ్రామ నివాసి. ఆయన భౌతికకాయం బుధవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో స్వగ్రామానికి చేరుకుంది. రవి మృతితో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగిపోయింది. రవికి ఈ ఏడాది డిసెంబర్ లో పెళ్లి జరగాల్సి ఉంది.
బుధవారం జరిగిన రాజోరి ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఎన్కౌంటర్లో ఆర్మీ జవాను రవికుమార్ వీరమరణం పొందాడు. అతను కిష్త్వార్ జిల్లా వాసి. బుధవారం ప్రతికూల వాతావరణం కారణంగా అతని మృతదేహం స్వగ్రామానికి చేరుకోలేకపోయింది. గురువారం అతని పార్థివదేహం స్వగ్రామానికి చేర్చారు. అతనికి గౌరవప్రదంగా అంతిమ వీడ్కోలు పలికారు.