కరోనా క్రైసిస్.. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ రెడీ

కరోనా క్రైసిస్.. ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ రెడీ

బల్లియా: కరోనా మహమ్మారిపై పోరులో దేశ ప్రజలకు సాయం చేసేందుకు ఆర్మీ సిద్ధంగా ఉందని చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) బిపిన్ రావత్ అన్నారు. ఉత్తర్ ప్రదేశ్‌‌లోని బల్లియా జిల్లాలో ఓ సోషల్ ఆర్గనైజేషన్ నిర్వహించిన సెమినార్‌లో వీడియో కాన్ఫరెన్స్‌‌ ద్వారా రావత్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో కరోనా వ్యాప్తిని తగ్గించేందుకు ప్రజలందరూ ముందుకొచ్చి పోరాడాలని పిలుపునిచ్చారు. ఈ క్రమంలో ప్రజలకు సాయం చేసేందుకు, వారికి అండగా నిలిచేందుకు ఆర్మీ రెడీగా ఉందని స్పష్టం చేశారు.