కొమురవెల్లిలో మహాశివరాత్రి పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి

కొమురవెల్లిలో మహాశివరాత్రి పెద్దపట్నానికి ఏర్పాట్లు పూర్తి

కొమురవెల్లి, వెలుగు: కొమురవెల్లి మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పెద్దపట్నం నిర్వహించేందుకు తోటబావి వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం కొమురవెల్లి ఆలయ ఈవో బాలాజీ, చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి పనులన పరిశీలించారు. 

లింగోద్భవ కాలంలో ఆలయ గర్భగుడిలో మహన్యాస పూర్వక రుద్రాభిషేకం నిర్వహించిన అనంతరం 160 మంది ఒగ్గు పూజార్ల ఆధ్వర్యంలో ఆలయ తోటబావి వద్ద 41 వరుసలతో పెద్దపట్నం వేస్తారు. అనంతరం ప్రత్యేక పూజలు చేసి పెద్దపట్నం దాటి స్వామిని దర్శించుకుంటారు. ఇందుకోసం పెద్దపట్నం వేసే ప్రాంగణాన్ని శుభ్రం చేయించి సిమెంట్ ఫ్లోరింగ్ వేయించారు. భక్తులు తిలకించేందుకు ప్రత్యేక గ్యాలరీలు,  లైటింగ్ ఏర్పాటు చేశారు.