అట్టుడుకుతున్న అరుణాచల్

అట్టుడుకుతున్న అరుణాచల్

అరుణాచల్ ప్రదేశ్ అట్టుడుకుతోంది. స్థానికేతరులకు పర్మినెంట్‌ రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్లు ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఈటానగర్ లో ఆందోళనలు కొనసాగుతున్నా యి. పోలీసుల కాల్పుల్లో ఓ నిరసనకారుడు చనిపోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా యి. ఆందోళనకారులు అరుణాచల్ డిప్యూటీ సీఎం ఇంటిపై దాడి చేశారు. బిల్డింగ్ ఆవరణలోని వాహ నాలను తగలబెట్టారు. హింసాత్మక ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈటానగర్ కర్ఫ్యూ విధించింది.కేంద్ర బలగాలను రంగంలోకి దించింది. ఇటానగర్‌లోని పలు ఏటీఎంలు నగదులేక వెలవెలబోతున్నాయి. శుక్రవారం నుంచి ఇప్పటివరకు ఆందోళనకారులు 60కిపైగా వాహనాలను దగ్ధం చేశారని, మరో 150కిపైగా వాహనాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.