దేశం కోసం పుట్టా.. దేశం కోసం చస్తా... ఎవరికి భయపడను : అరవింద్ కేజ్రీవాల్

దేశం కోసం పుట్టా.. దేశం కోసం చస్తా...  ఎవరికి భయపడను : అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 16 ఆదివారం రోజున ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సీబీఐ విచారణకు హాజరుకానున్నారు. విచారణకు హాజరు అయ్యేముందు ఆయన ఓ వీడియోను రిలీజ్  చేశారు.  సీబీఐ అడిగే ప్రతిప్రశ్నకు తాను సమాధానం చెప్తానని అన్నారు. తనని సీబీఐ అరెస్ట్ చేస్తుదంటూ బీజేపీ ప్రచారం ప్రచారం చేస్తోందని చెప్పారు. జైలో పెడతామని పదేపదే బెదిరిస్తున్నారని అన్నారు. తాను గత 8 ఏళ్లలో ఢిల్లీని అభివృద్ధి చేసి చూపించానని,  గత30 ఏళ్లలో మీరు  గుజరాత్ ను ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని కేజ్రీవాల్ డిమాండ్ చేశారు.  

కేజ్రీవాల్ ను పడగొట్టాలని సీబీఐని బీజేపీ ఆదేశించిందని కేజ్రీవాల్ ఆరోపించారు. బీజేపీ అధికార  అహాంకారంతో వ్యవహరిస్తోందని,  తమ మాట వినకపోతే జైల్లో పెడతామనేలా వ్యవహరిస్తోందని అన్నారు.  తప్పు చేయకున్నా వీళ్లు జైల్లో వేస్తారని, రాజకీయ నాయకులు, మీడియా, ప్రజలు ఇలా  ఎవరినైనా సరే బెదిరిస్తారని వినకపోతే జైలులో వేస్తారన్నారు. తాను దేశాన్ని ప్రేమిస్తానని, దేశం కోసం పుట్టానని, దేశం కోసం  ప్రాణాలైనా ఇస్తానని అన్నారు. తాను ఎవరికి భయపడనని కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఏప్రిల్ 16న విచారణకు హాజరుకావాలని సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ ఇప్పటికే  సమన్లు పంపింది. ఏప్రిల్ 16 ఆదివారం ఉదయం 11 గంటలకు  కేజ్రీవాల్ ను సీబీఐ విచారించనుంది. ఇప్పటికే ఈ కేసులో పలుమార్లు ప్రశ్నించి ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ  ఫిబ్రవరి 26న అరెస్టు చేసింది. కేజ్రీవాల్ ను విచారించనున్న నేపథ్యంలో  సీబీఐ  సెంట్రల్ ఆఫీస్ వద్ద భారీ బందోబస్త్ ను పోలీసులు ఏర్పాటు చేశారు.