ఎంజీఎంలో పాము ప్రత్యక్షం... భయంతో పేషెంట్లు పరుగు

ఎంజీఎంలో పాము ప్రత్యక్షం... భయంతో పేషెంట్లు పరుగు

వరంగల్: నగరంలోని ఎంజీఎం ఫీవర్ వార్డులోపాము ప్రత్యక్షమైంది. దీంతో సిబ్బంది, పేషెంట్లు భయంతో పరుగు తీశారు. పేషెంట్లు, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం... ఎంజీఎంలోని ఫీవర్ వార్డులోని బాత్రూంలోకి నాగు పాము చొరబడింది. బాత్రూంలోకి వెళ్లిన అటెండర్స్ పామును  చూసి భయభ్రాంతులకు గురి అయ్యారు. తేరుకున్న సిబ్బంది వెంటనే ఆర్ఎంవోకు సమాచారం అందించారు.  స్పందించిన అధికారులు వెంటనే పాములు పట్టే వ్యక్తికి ఫోన్ కాల్ చేసి రప్పించారు. అతడు వచ్చి పామును పట్టి ఓ సంచీలో వేసి ఫారెస్ట్ అధికారులకు అప్పజెప్పాడు. దీంతో పేషెంట్లు, సిబ్బంది  సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.

గతంలో ఎంజీఎం హాస్పిటల్ లో ఎలుకలు కొరికిన ఘటనలో ఓ పేషెంట్ మృతి చెందాడు. ఆ సమయంలో హాస్పిటల్ సిబ్బందిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. హాస్పిటల్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంలో సిబ్బంది నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా పాము ఘటనతో సిబ్బందిపై పలువురు సోషల్ మీడియాలో ఫైర్ అవుతున్నారు.