స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరట్లే

స్వరాష్ట్ర ఆకాంక్షలు నెరవేరట్లే

పద్మారావునగర్, వెలుగు: స్వరాష్ట్ర లక్ష్యాలపై ప్రభుత్వాలు నీళ్లు చల్లుతున్నాయని తెలంగాణ రాష్ట్రీయ లోక్​ దళ్(టీఆర్​ఎల్​డీ)​ ప్రెసిడెంట్ కపిలవాయి దిలీప్​కుమార్​ విమర్శించారు. శుక్రవారం కవాడిగూడలోని టీఆర్​ఎల్డీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ప్రైవేట్​ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు అమలుకావడం లేదన్నారు. ఈ  సమస్యపై ఈ నెల 23న ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయనున్నట్లు తెలిపారు. 

రాజీవ్​ యువ వికాసం పథకానికి సిబిల్​ స్కోర్​ లింకు పెట్టవద్దన్నారు. మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణ అమరులకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం, పింఛన్​, భూమి ఎప్పుడిస్తారని  ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు కిన్నెర సిద్దార్థ, శాంతి, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, అజాజ్​ అహ్మద్, విశాల్, మల్లేశ్ పాల్గొన్నారు.