
పద్మారావునగర్, వెలుగు: స్వరాష్ట్ర లక్ష్యాలపై ప్రభుత్వాలు నీళ్లు చల్లుతున్నాయని తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్(టీఆర్ఎల్డీ) ప్రెసిడెంట్ కపిలవాయి దిలీప్కుమార్ విమర్శించారు. శుక్రవారం కవాడిగూడలోని టీఆర్ఎల్డీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు ప్రైవేట్ విద్యా సంస్థల్లో 25 శాతం సీట్లు అమలుకావడం లేదన్నారు. ఈ సమస్యపై ఈ నెల 23న ఇందిరాపార్కు వద్ద దీక్ష చేయనున్నట్లు తెలిపారు.
రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ లింకు పెట్టవద్దన్నారు. మహిళా విభాగం జాతీయ అధ్యక్షురాలు ఇందిరా మాట్లాడుతూ.. తెలంగాణ అమరులకు రూ.కోటి పరిహారం, ఉద్యోగం, పింఛన్, భూమి ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. సమావేశంలో నాయకులు కిన్నెర సిద్దార్థ, శాంతి, కోమటిరెడ్డి గోపాల్ రెడ్డి, అజాజ్ అహ్మద్, విశాల్, మల్లేశ్ పాల్గొన్నారు.