ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి 

ఆశా వర్కర్ల డిమాండ్లను నెరవేర్చాలి 

మెదక్ టౌన్/సిద్దిపేట టౌన్​/నారాయణ్ ఖేడ్, వెలుగు: ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే  తీర్చాలని పలువురు నాయకులు కోరారు. నారాయణఖేడ్​లోని ఆర్డీవో ఆఫీస్ ముందు ధర్నా చేస్తున్న ఆశా వర్కర్లకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సంగప్ప సంఘీభావం ప్రకటించారు. సిద్దిపేటలోని బీజేఆర్ చౌరస్తా వద్ద నిరాహార దీక్ష  చేస్తున్న ఆశాలకు ధర్మ సమాజ్​ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు రవిబాబు మహారాజ్  మద్దతు తెలిపారు.

తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సమ్మె చేస్తున్న ఆశాలను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సీఐటీయూ సిద్దిపేట జిల్లా కార్యదర్శి కాముని గోపాల్ స్వామి ఖండించారు. మెదక్​ జిల్లా కేంద్రంలో ఆశా వర్కర్ల  భిక్షాటన చేసి నిరసన తెలిపారు.