ఆశా వర్కర్ల సేవలు మరువలేం

ఆశా వర్కర్ల సేవలు మరువలేం

జనగామ జిల్లా: కరోనా సమయం లో ఆశా వర్కర్లు, ANMల పనితీరు అద్భుతమన్నారు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా మహా సభలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ విష జ్వరాల నిర్మూలనలో తెలంగాణ రాష్ట్రం 3వ స్థానంలో నిలిచిందని అన్నారు. ఆశావర్కర్ల కృషివల్లే ఇది సాధ్యమైందన్నారు. ఆశా వర్కర్లకు గౌరవ వేతనం 9 వేల 7 వందల 50 రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన తెలిపారు. ఆశా వర్కర్లను త్వరలోనే సీఎం కేసీఆర్ ఊహించని రీతిలో ఆదుకోబోతున్నాడని చెప్పారు. గతంలో ఆశాలకు జీతాలు ఇవ్వడమే గగనంగా ఉండేదని ఆయన గుర్తు చేశారు. ఇప్పుడు ప్రతి నెలా జీతాలు వస్తున్నాయని మంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.