
- గుండెపోటుతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి
- మహబూబాబాద్ జిల్లా కేసముద్రంలో ఘటన
మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పోలీస్స్టేషన్లో ఏఎస్సైగా పని చేస్తున్న కె.కృష్ణమూర్తి(58) ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్సై కృష్ణమూర్తి పోలీస్స్టేషన్లో డ్యూటీ చేస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.
గమనించిన తోటి సిబ్బంది 108లో మహబూబాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఏఎస్సై మృతి పట్ల ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, మహబూబాబాద్ డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య సంతాపం తెలిపారు. ఏఎస్సై కుటుంబాన్ని ఆదుకుంటామనిచెప్పారు.