డ్యూటీలోనేకుప్పకూలిన ఏఎస్సై

డ్యూటీలోనేకుప్పకూలిన ఏఎస్సై
  • గుండెపోటుతో హాస్పిటల్​లో చికిత్స పొందుతూ మృతి
  • మహబూబాబాద్​ జిల్లా కేసముద్రంలో ఘటన

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం పోలీస్​స్టేషన్​లో ఏఎస్సైగా పని చేస్తున్న కె.కృష్ణమూర్తి(58)  ఆదివారం సాయంత్రం గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏఎస్సై కృష్ణమూర్తి పోలీస్​స్టేషన్​లో డ్యూటీ చేస్తుండగా, గుండెపోటు రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. 

గమనించిన తోటి సిబ్బంది 108లో మహబూబాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. ఏఎస్సై మృతి పట్ల ఎస్పీ సుధీర్ రామ్​నాథ్​ కేకన్, మహబూబాబాద్​ డీఎస్పీ తిరుపతిరావు, మహబూబాబాద్​ రూరల్​ సీఐ సర్వయ్య సంతాపం తెలిపారు. ఏఎస్సై కుటుంబాన్ని ఆదుకుంటామనిచెప్పారు.