ఎడతెరపి లేని వానలు అస్సాంను కుదిపేస్తున్నాయి. ఈ వరద విలయానికి వేలాది మంది నిరాశ్రయులు కాగా, ఎంతో మంది ఆహారం కోసం అలమటిస్తున్నారు. ఆ రాష్ట్ర ప్రభుత్వ తగు సహాయ చర్యలు చేపట్టినా.. ఇంకా పరిస్థితి మాత్రం అదుపులోకి రాలేదు. వరదల తాకిడికి రహదారులు కొట్టుకుపోయి, పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలోనే వర్షాలు సృష్టించిన బీభత్సానికి వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. దీంతో అన్నదాతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వార్తల కోసం...